Home ప్రకాశం ఉచిత వైద్య శిభిరానికి విశేష స్పందన

ఉచిత వైద్య శిభిరానికి విశేష స్పందన

164
0

  • వాడరేవు ఆశ్రమంలో ఉచిత వైద్య శిభిరంలో 746మందికి పరీక్షలు
  • నెలరోజులకు సరిపడు మందులు ఉచితంగా పంపిణీ
  • అల్పాహారం, వసతుల ఏర్పాటు
  • శ్రీశ్రీశ్రీ రామానంద ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వాడరేవు ఆశ్రమం ఆవరణలో ఆదివారం ఉచిత షుగరు వైద్యశిభిరం నిర్వహించారు. వైద్యశిభిరంలో 746మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. శిభిరానికి విశేష స్పందన లభించింది. వైద్య పరీక్షలు చేయించుకున్న 746మందికి నెల రోజులకు సరిపడు మందులు ఉచితంగా అందజేశారు. శిభభిరానికి హాజరైన షుగరు బాధితులకు అల్పారం, తాగున్నీరు, ఇతర సహాయక ఏర్పాట్లు చేసినట్లు ఆశ్రమ మేనేజర్‌ నారాయణం సురేష్‌ తెలిపారు. మందులపైనే ఆధార పడకుండా ఆహార అలవాట్లు, రోజువారి జీవన విధానం మార్చుకోవాలని డాక్టర్లు సూచించారు. నడక అలవాటు చేసుకోలని చెప్పారు. తేలికపాటి ఆహారం తీసుకోవాలని అన్నారు. మానసిక ఆందోళన తగ్గించుకునే విధంగా జీవన విధానం మార్చుకోవడం ద్వారా షుగరును నియంత్రణలో ఉంచుకోవచ్చని సూచించారు. క్యాంపులో డాక్టర్‌ ఎం రాజరాజేశ్వరి, డాక్టర్‌ కమలారాజేశ్వరి, డాక్టర్‌ లలిత్‌ప్రకాష్‌, డాక్టర్‌ పేట శ్రీకాంత్‌, డాక్టర్‌ సుధాకర్‌ యాదవ్‌ వైద్యపరీక్షలు చేశారు. ట్రస్ట్‌ ఉపాధ్యక్షులు కె కృష్ణారావు, కామేశ్వరరావు, ఎంజి శంకరరావు, కె బసవరావు, ఎ సురేష్, మిత్ర ల్యాబ్ వలి, దుర్గగుడి శీను, గోపాల్, వాడరేవు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు నరసింహారావు, విద్యార్థులు, చీరాల మహిళా కళాశాల విద్యార్థులు రోగులకు ఆహారం, తాగునీటి వసతుల ఏర్పాట్లను పర్యవేక్షించారు.