సిసిసికి హీరో సాయికుమార్ రూ.5లక్షలు, డబ్బింగ్ యూనియన్ కు మరో రూ.2లక్షలు కలిపి రూ.8లక్షలు విరాళం అందజేశారు.
మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పడిన కరోనా క్రైసెస్ చారిటీ మనకోసంకు హీరో సాయికుమార్ ఆయన తనయుడు హీరో ఆది కలిసి ఐదు లక్షల నాలుగు రూపాయలను సినీ కార్మికుల సంక్షేమం కోసం విరాళంగా ఆర్ టి జి ఎస్ ద్వారా బుధవారం సీసీసీకి పంపించారు. అలాగే డబ్బింగ్ యూనియన్ అసోసియేషన్ కు కూడా సాయికుమార్ తనవంతుగా ఒక లక్ష ఎనిమిది రూపాయలు, సాయికుమార్ సోదరుడు రవిశంకర్ ఒక లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు.