Home ఆంధ్రప్రదేశ్ భార‌త ఉప‌ రాష్ట్రపతి వెంక‌య్య‌నాయుడుకు రేణిగుంట ఎయిర్పోర్ట్‌లో ఘన స్వాగతం

భార‌త ఉప‌ రాష్ట్రపతి వెంక‌య్య‌నాయుడుకు రేణిగుంట ఎయిర్పోర్ట్‌లో ఘన స్వాగతం

308
0

తిరుపతి : మూడు రోజుల తిరుపతి తిరుమల పర్యటన నిమిత్తం వైజాగ్ నుండి భారత వాయు సేన ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం 11:05గంటలకు రేణిగుంట ఓల్డ్ ఎయిర్పోర్ట్‌కు భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు చేరుకున్నారు. ఆయ‌న‌కు జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అర్బన్ ఎస్పీ అన్బురాజన్, తిరుపతి మునిసిపల్ కమీషనర్ విజయరామ రాజు, సబ్ కలెక్టర్ మహేష్ కుమార్ పుష్ప గుచ్చాలు అంధించి రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు.

ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీతేజ్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సురేష్, ఎయిర్పోర్ట్ భద్రతా అధికారులు రాజశేఖర్ రెడ్డి, డిసి శుక్లా, చిత్తూరు ఆర్డిఓ మల్లిఖార్జున, మెప్మా పీడీ జ్యోతి, ఎడిఎఫ్ఓ ఆదినారాయణరెడ్డి, అదనపు ఏస్పీ అనిల్ బాబు, డిఎస్పీ చంద్రశేఖర్, బిజెపి నాయకులు చిలకం రామచంద్రారెడ్డి, భానుప్రకాష్ రెడ్డి తనయుడు పృథ్వీ, పుష్పలత, తహసీల్దార్ మాధవకృష్ణారెడ్డి కూడా ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఉపరాష్ట్రపతి వెంక‌య్య‌నాయుడు ప్రత్యేక వాహన శ్రేణిలో గాదంకి ఎన్ఏఆర్ఎల్‌కు వెళ్లారు. మధ్యాహ్నం తిరిగి తిరుపతి పద్మావతి అతిధి గృహం చేరుకుని కొద్ది సేపు విశ్రాంతి తీసుకుంటారు. ఈ నెల 4న ఉదయం ఉప రాష్ట్రపతి తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్షించుకుంటారు. 5వ తేదీన బుధవారం ఉదయం 10గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్ ప్రయాణమవుతారు.