Home గుంటూరు రోగులకు పండ్లు పంపిణీ : బాపట్ల

రోగులకు పండ్లు పంపిణీ : బాపట్ల

347
0

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి రామారావు 24వ వర్థంతి సందర్బంగా  బాపట్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో  రోగులకు వేగేశ్న ఫౌండేషన్ చైర్మన్ టిడిపి బాపట్ల నియోజకవర్గ నాయకులు వేగేశన నరేంద్ర వర్మ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలో పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు లోకి తీసుకొచ్చిన మహా నాయకుడు అని పేర్కొన్నారు. స్థానిక సంస్థలు మహిళలకు రిజర్వేషన్లు అమలులోకి తెచ్చినటువంటి మహానాయకుడు అన్నారు. మహిళలకు ఆస్తి హక్కు చట్టం తీసుకువచ్చిన అటువంటి చరిత్ర ఎన్టీఆర్ దే అన్నారు.