Home ప్రకాశం ఉచిత షుగరు వైద్య శిబిరానికి విశేష స్పందన

ఉచిత షుగరు వైద్య శిబిరానికి విశేష స్పందన

522
0

చీరాల : వాడ్రేవు శ్రీ శ్రీ శ్రీ రామానంద సరస్వతి ఆశ్రమం ఆవరణలో ప్రతినెల నిర్వహిస్తున్న ఉచిత షుగర్ వైద్య శిబిరము ఎప్పటిలాగానే డిసెంబర్ 22న నిర్వహించారు. వైద్య శిబిరంలో గుంటూరు వైద్య కళాశాల విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ రాజరాజేశ్వరి, ప్రొఫెసర్ డాక్టర్ కమల రాజేశ్వరి, డాక్టర్ పి శ్రీకాంత్, డాక్టర్ సుధాకర్ యాదవ్, డాక్టర్ లలిత ప్రకాష్, డాక్టర్ రవి కాంత్ రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు.

వైద్య పరీక్షల అనంతరం రోగులకు అవసరమైన రెండు నెలలకు సరిపడా మందులను ఉచితంగా అందజేశారు. వైద్య శిబిరానికి హాజరైన రోగులకు ఆశ్రమం ఆధ్వర్యంలో ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేశారు. వైద్య శిబిరంలో 1264 మంది రోగులు వైద్య పరీక్షలు చేయించుకొని మందులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కే కృష్ణారావు, మేనేజర్ నారాయణం సురేష్, ఏ సురేష్, ఎంజి శంకర్ రావు, పి కామేశ్వరరావు పాల్గొన్నారు.