– ప్రతి ఒక్కరూ ఇంట్లో వుంటే కరోనాను కట్టడి అన్న సిఐ ఫిరోజ్
– పేదవారికి సేవ భగవంతుడి సేవతో సమానమన్న గోలి ప్రసాద్
– పేదవారికి ఆహారం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్న తాడివలస దేవరాజు
చీరాల : పేదలకు ఆహారం అందజేయాలనే ఉద్దేశ్యంతో పేరాల సాయి బాబా మందిర్ కమిటీ సహకారంతో ఈపురుపాలెం దండుబాటలోని నిరుపేదలకు, తోటవరిపాలెం దండెయ్యకాలనీ వారికి, ఈపురుపాలెం ఎత్తిపోతల పథకం దగ్గరున్న నిరుపేదలు 500మందికి సాంబార్ అన్నం, పెరుగన్నం, అరటి పండ్లు పంపిణీ చేశారు.
అపదలోఉన్న పేదలకు చేయూత నివ్వటం ప్రతిఒక్కరి బాధ్యతని టూ టౌన్ సిఐ ఫిరోజ్ పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో రోజువారీ కూలీలు, రిక్షా కార్మికులు, ఇతర పేదలు పనులు లేక ఆహారం దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి గురువారం ఆహార పోట్లాలను పంపిణీ చేశారు.
పేరాల సాయిబాబా గుడి ప్రెసిడెంట్ గోలి ప్రసాద్ మాట్లాడుతూ కరోనా మానవాళికి తీరని కష్టాలను తెచ్చి పెట్టిందన్నారు. అయినప్పటికీ అందరం ధైర్యంతో దీనిపై పోరాడి విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి కరోనా నియంత్రణకు కృషి చేయాలని కోరారు. పేదలు అధైర్యపడవద్దని త్వరలోనే మంచి రోజులు వస్తాయని చెప్పారు. లాక్డౌన్ కాలంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పేరాల శ్రీ సాయిబాబా కమిటీ సభ్యులు శివ కోటేశ్వరరావు, ఉడతా భాస్కర్, మధు, శ్రీనివాస్ రావు, భాస్కరరావు, మల్లికార్జున్, రంగనాయకులు, దేవేంద్ర, మాజీ ఎంపీపీ నాదెండ్ల కోటేశ్వరరావు, టూ టౌన్ ఎస్ఐ విజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది, రోటరీ క్లబ్ ఆఫ్ క్షిరపురి వ్యవస్థాపక అధ్యక్షులు అడ్డగడ్డ మల్లికార్జునరావు, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.