చీరాల : శాసన సభ్యులు మద్దులూరి మాలకొండయ్య, బాలకొండమ్మ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు బోస్నగర్లోని ఊటుకూరి వెల్ఫేర్ సొసైటీ వృద్దాశ్రమంలో శుక్రవారం అన్నదానం చేశారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. కార్యక్రమంలో కోటి మోహన్, బుర్ల రాంబాబు, నక్కల శ్రీనివాసరావు, కొమ్మనబోయిన రజిని, ఎఎంసి ఛైర్మన్ కౌతరపు జనార్దనరావు, వావిలకొలను ప్రేమ కుమార్ పాల్గొన్నారు.