చీరాల (DN5 News) : స్థానిక ఎన్ఆర్ అండ్ పిఎం ఉన్నత పాఠశాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కటారివారిపాలెం జెడ్పి ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడా పరికరాల కొనుగోలుకు వాకింగ్ సభ్యులు తిరుమలశెట్టి లక్ష్మీ ప్రతాప్, వంగర పూర్ణచంద్రరావు రూ.5వేల ఆర్ధిక సహాకారంతో వాలీబాల్, క్రికెట్ కిట్, జావెలిన్ త్రో, డిస్కస్, షాట్ పట్ వంటి క్రీడా పరికరాలు హెడ్ మాష్టర్ కొత్త పద్మావతి, పిడి లలితాంబ, ఉపాధ్యాయులు శిద్దాబత్తుని శివ శ్రీనివాస్లకు అందజేశారు. కార్యక్రమంలో పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ళ గురుప్రసాద్, సుధాకరరావు, నారాయణమూర్తి, శీరాం రమేష్, వీరాంజనేయులు, తుకారాం, రమేష్, ప్రసాద్, మురళీకృష్ణ పాల్గొన్నారు.






