కొండపి : బాలికల గురుకుల పాఠశాలలో కాంట్రాక్టు పద్ధతిలో ఆరుగురు మహిళా సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ప్రతియేటా వేసవిలో సెక్యూరిటీకి ముగ్గురికే ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. వరుస క్రమంలో గత ఏడాది విధులు నిర్వహించిన వారికి కాకుండా మిగిలిన ముగ్గురికీ ప్రస్తుతం విధులు కేటాయించారు. దీంతో గత ఏడాది విధులు నిర్వహించిన జూనియర్ సెక్యూరిటీ ఎస్ భాగ్యలక్ష్మి తనకు విధిలు ఇవ్వాలని, తనను తంబ్ వేయనివ్వకపోతే తనకు ప్రభుత్వంలో పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారని బెదిరింపులకు దిగి తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని ప్రిన్సిపాల్ ఇస్తర్ల కోటేశ్వరరావు వివరణ ఇచ్చారు. తనపై మహిళా సెక్యూరిటీ భాగ్యలక్ష్మి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
పాఠశాల మహిళా ఉపాధ్యాయులు, సిబ్బంది, సెక్యూరిటీ మహిళా సిబ్బంది ప్రిన్సిపాల్ పై భాగ్యలక్ష్మి తప్పుడు ఆరోపణలు చేస్తుందని, ఆరోపణలు అవాస్తవమని చెబుతున్నారు. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం భాగ్యలక్ష్మి సంవత్సరం నుండి ఇక్కడ సెక్యూరిటీగా పనిచేస్తుందని చెప్పారు. పాఠశాలలో సెక్యూరిటీగా ఆమెతో పాటు ఆరుగురు మహిళలు పనిచేస్తున్నారని చెప్పారు.
మే నెలలో పై అధికారులు ముగ్గురు మాత్రమే పని చేయాలని సూచించడంతో గత సంవత్సరం పని చేసిన ముగ్గురు మహిళలు ఈ సంవత్సరం ఆగిపోతే గత సంవత్సరం పనిచేయని ముగ్గురు ఈ సంవత్సరం పని చేస్తారని ప్రిన్సిపాల్ చెప్పారు. గత సంవత్సరం పని చేసిన భాగ్యలక్ష్మి ఈ యేడాది కూడా నేను పనిచేస్తానని అన్నారు. నీ కంటే సీనియర్లు ఉన్నారు కాబట్టి వాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలి కదా అని ప్రిన్సిపాల్ చెప్పారు. దీంతో ఆమె కోపంతో ఇటువంటి నిందారోపణలు చేయడం బాధగా ఉందని మహిళా సిబ్బంది అన్నారు. ఆమె చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఆమెకు తండ్రి లాంటివాడిపై ఇలాంటి ఆరోపణలు చేయడం బాధగా ఉందని అన్నారు.
పాఠశాల మహిళా ఉపాధ్యాయులు, సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది మాట్లాడుతూ ప్రిన్సిపాల్ తండ్రి లాంటి వారని అన్నారు. అందరినీ బిడ్డల్లాగా చూసుకుంటారని అన్నారు. సెక్యూరిటీ భాగ్యలక్ష్మి సీనియర్లను కాదని తనకు గతేడాది, ఈఏడాది కూడా సెక్యూరిటీగా అవకాశం ఇవ్వాలని కోరడం, కాదన్నందుకు ఈ విధంగా ప్రిన్సిపాల్ మీద ఆరోపణలు చేయడం బాధగా ఉందని తెలిపారు.
సెక్యూరిటీగా పని చేస్తున్న మహిళా ఉద్యోగి భాగ్యలక్ష్మి తనపై ప్రిన్సిపల్ లేంగిక వేదింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. తన కోరిక తీర్చకుంటే ఉద్యోగం ఉండదని బెదిరపులకు పాల్పడినట్లు ఆరోపించారు.