Home ఆంధ్రప్రదేశ్ విధాన పరమైన నిర్ణయాలు ప్రకటించకుంటే క్యాబినెట్ ఒకే

విధాన పరమైన నిర్ణయాలు ప్రకటించకుంటే క్యాబినెట్ ఒకే

344
0

అమరావతి : ఎపి కేబినెట్ మీటింగ్ కు సీఇసి అనుమతి ఇస్తుందో లేదోనన్న ఉత్కంఠ నేపథ్యంలో ఢిల్లీ నుంచి చల్లని కబురు అందింది. సీఇసి అనుమతి ఇచ్చింది. దీంతో మంగళవారం ఉదయం కేబినెట్ మీటింగ్ నిర్వహించే అవకాశం ఉంది.

ఈ సమావేశానికి మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులందరు హాజరయ్యే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కేబినెట్ మీటింగ్ కు అనుమతి ఇవ్వకపోవచ్చని అధికారవర్గాలు భావించారు. అయితే సీఇసి అనుమతివ్వటంతో మంత్రివర్గం సమావేశానికి మార్గం సుగమం అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలతో అధికారికంగానే ఆచరణయోగ్యమైంది.

మంత్రివర్గ సమావేశానికి అనుమతిస్తూ సీఇసి షరతులు విధించింది. నూతన పాలసీ విధాన పరమైన నిర్ణయాలు ప్రకటించకూడదని పేర్కొంది. ఏ రంగంలోనూ ధరల పెరుగుదల, పెండింగ్ బిల్లుల చెల్లింపు వంటి నిర్ణయాలు తీసుకోకూడదని సీఇసి షరతు పెట్టింది.