Home ఆంధ్రప్రదేశ్ జిల్లాలో నీటి సమస్యలను తీర్చుతాం : మంత్రి బాలినేని

జిల్లాలో నీటి సమస్యలను తీర్చుతాం : మంత్రి బాలినేని

402
0

– వివిధ శాఖల అధికారులతో రివ్యూ
– పశ్చిమ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్ట్‌ పూర్తికై కృషి
– రైతులకు పగలు 9 గంటలు విధ్యుత్‌ పై కసరత్తు 
– ట్రిపుల్‌ ఐటి తత్కాలిక భవనాలకై అన్వేషణ
– వారంరోజుల్లో డి.ఎస్సి అభ్యర్ధుల నియామక ప్రక్రియ
– ట్రిపుల్‌ ఐటిని తిరిగి ఒంగోలుకు తెస్తాం
– విలేకరుల సమావేశంలో ఇద్దరు జిల్లా మంత్రులు

ఒంగోలు : జిల్లాలను ప్రధానంగా పట్టిపీడిస్తున్న నీటి సమస్య పరిష్కారమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నమాని రాష్ట్ర విధ్యుత్‌, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖా మాత్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కోన్నారు. స్ధానిక ఎన్‌ఎస్‌పి విశ్రాంతి గృహం నందు ఆదివారం వివిధ శాఖల అధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి బాలినేనితోపాటు విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ పాల్గొన్నారు. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొట్టమెదటి సారిగా వివిధ శాఖల జిల్లా అధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. తొలుత జిల్లాకు సంబందించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించనున్న సేవలు పారదర్శకంగా జరిగేలా భాద్యతాయుతంగా వ్యవహరించాలని తెలియజేశారు. అధికారులకు పలు సూచనలను ఇరుమంత్రులు అందించారు.

అనంతరం విలేఖరులతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్ళ నుండి జిల్లా ప్రజలు కరువు కాటకాలతో అల్లడుతున్నారన్నారు. ప్రధానంగా జిల్లాను నీటి కొరత వేదిస్తున్న అంశంగా ఉందన్నారు. పశ్చిమ ప్రాంత అభివృద్దికై వెలుగొండ ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సంగతి గుర్తుచేశారు. గత ప్రభుత్వం ప్రదాన సమస్యలను గాలికొదిలేసి ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టిందని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ పూర్తితో పశ్చిమ ప్రాంతంలో అన్ని సమస్యలకు పరిష్కారం దొరకనుందని వివరించారు. గత ప్రభుత్వం మాదిరిగా అబద్దపు వాగ్దానాలు చేసి ప్రజలను మోసగించే పనులు తాము చేయబోమన్నారు. వెలుగొంగ ప్రాజెక్ట్‌ జగన్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు. అతి త్వరలో సంబందిత మంత్రి ద్వారా అక్కడి పరిస్ధితులు రివ్యూ చేయించి వెలుగొండ పూర్తికి కృషిచేస్తామని హామి ఇచ్చారు.

ఇక మున్సిపాలిటీల పరిధిలోని అర్బన్‌, రూరల్‌ ప్రాంతాలలో త్రాగునీటి సమస్య ఒక సవాలుగా తయారైయిందన్నారు. అయినప్పటికి నాలుగురోజులకు ఒకసారి ప్రజలకు నీటి విడుదల చేస్తున్నామన్నారు. ఒంగోలులోను అదే పరిస్ధితి నెలకొందన్నారు.

గత ప్రభుత్వ ప్రజాప్రతినిధి అభివృద్ధిపేరుతో ఒంగోలులో బారీ అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. కాంట్రాక్టర్ల దగ్గర నుండి పర్సంటేజీలు మింగేసి రోడ్లుమీద రోడ్లు వేసి అభివృద్ది చేస్తున్నామంటూ ప్రజలు మభ్యపెట్టారన్నారు. ఏడుగుండ్లపాడు ద్వారా ఒంగోలుకు పైప్‌ లైన్‌ వేసి నీరు తేచ్చే పధకంలో రూ.72 కోట్లు మున్పిపాలిటీ వాటాగా చెల్లించాల్సి ఉండాగా ఇంతవరకు ఒక్క రూపాయికూడా చెల్లింలేదన్నారు. ప్రస్తుత పరిస్ధితులలో మున్సిపాలిటి అంత డబ్బును చెల్లించే స్ధితిలో లేదన్నారు. ముఖ్యంత్రి వైఎస్‌ జగన్‌ దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్ళి ఏడుగుండ్లపాడు నుండి పైపులైన్‌ను త్వరలో పూర్తిచేసి ఒంగోలుకు నీటి సమస్యను తీర్చుతానని హామి ఇచ్చారు.

రూరల్‌ ప్రాంతాలలో నీటిని అందించేదుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశేదుకు రూ.48కోట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌కు ఫండ్స్‌ రిలీజ్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంత్రి జగన్‌ దృష్టికి తీసుకువెళ్లి త్వరలో ఆ మొత్తాన్ని రిలిజ్‌ చేయనున్నట్లు తెలియజేశారు. రామయపట్నం పోర్టు, దొనకొండ ఇండ్రస్ట్రీయల్‌ కారిడార్‌, కనిగిరి నందు ఎయియ్స్‌ను త్వరలో ప్రారంభించేందుకు కృషిచేస్తామన్నారు.

రైతులకు పగటిపూట తొమ్మిది గంటల కరెంటును అందించేందుకు ప్రణాళిక తయారుచేశామన్నారు. ముందుగా రాష్టంలోని 60 శాతం గ్రామాలలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు తెలియపారు. అనంతరం విధ్యుత్‌ను సరఫరా చేయుటలో ఏదురైయ్యేటువంటి సమస్యలను అధిగమించి పూర్తి స్ధాయిలో రైతులకు మేలు జరిగేలా రాష్ట్ర మొత్తం అమలుచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని విదాల అభివృద్ది చేసేందుకు ప్రధాన మంత్రి మోడిసైతం తమ వంతు సాయాన్ని అందించేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. ఇటీవల తిరుపతి వచ్చిన సందర్భంగా రాష్ట్రముఖ్యంత్రి వైఎస్‌ జగన్‌కు హాచ్చారని అన్నారు.

L

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ జిల్లాకు సంబందించి ట్రిపుల్‌ఐటి, ప్రకాశం యూనివస్సిటి, డిఎస్సీ మూడు అంశాలు ఉన్నాయన్నారు. దివంగత రాజశేఖరెడ్డి ప్రతిష్టత్మకమైన ట్రిపుల్‌ ఐటిని రూపకల్పన చేశారని గుర్తుచేశారు. ఇడుపులపాయలో గత మూడు సంవత్సరాల నుండి ట్రిపుల్‌ ఐటి నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రతి సంవత్సరం వెయ్యి మంది విద్యార్ధులు అక్కడ అడ్మిషన్లు పొందుతున్నారని తెలియజేశారు. ఇప్పటికి అక్కడ మూడువేల మంది విద్యార్ధులు  సరైన వసతులు లేక నరకయాతన పడుతున్న పరిస్ధితి ఉందన్నారు. గత ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కార దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

ఒంగోలుకు సంబందించి ఈ సంవత్సరం అద్దె భవనాలలోనైనా ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్దంచేశామన్నారు. ఒంగోలు రావ్ అండ్‌ నాయుడు కాలేజీని ఎంపికలో తీసుకున్నాప్పటికి అది ఒక్క బ్యాచ్‌కు మాత్రమే సరిపోతుందని అనంతరం అడ్మిషన్లు పొందిన విద్యార్ధులకు మరో చోట ఏర్పాటు చేయవలసి వస్తుందన్నారు. తాత్కాలికంగానైనా సరే విద్యార్ధులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా కనీసం మూడు సంవత్సరాలు సరిపోయేటువంటి భవనాన్ని అన్వేషిస్తున్నామన్నారు. ఈ సంవత్సరమే ట్రిపుల్‌ ఐటిని ఒంగోలులో ప్రారంభిస్తున్నామన్నారు.

ప్రకాశం యూనివర్సిటీకి సంబందించి యూనివర్సిటి యాక్ట్‌ నందు కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వాలు అవేవి పట్టించుకోకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు చేసిన శంఖుస్ధాపనలు, శిలాఫలకాలు సమాధి బండలను తలపిస్తున్నాయాని ఎద్దేవాచేశారు. రాబోయేటువంటి బజ్జట్‌ సమావేశాలలో దీనిని ప్రవేశపెట్టి దానికి కావలసిన అన్ని వనరులు సమకూర్చి త్వరలోనే యూనివర్సిటి భవనాలు పూర్తిచేసే విధంగా ప్రయత్నిస్తానన్నారు.

డిఎస్సీకి సంబందించి గత ప్రభుత్వం వారే అంతా పూర్తిచేశారని ఎన్నికలు రావడం వలన నియామకాల ప్రక్రియ కొంత ఆలస్యమైయిందన్నారు. నియామక ప్రక్రియగురించి అధికారులు ముందుగానే ఆదేశాలు జారీచేశారన్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటుచేసి వారంరోజులలో జిల్లాల వారిగా సర్టిఫికేట్లు వెరిఫికేషన్‌ చేసిన అనంతరం రోస్టర్‌ విధానంలో త్వరలోనే అపాయింట్‌మెంట్‌ ఆర్టర్లు అదజేస్తామని తెలియజేశారు.

అమ్మవడి పథకం ద్వారా కార్పోరేట్‌ పాఠశాలలకు లభ్ది చేకూరుతుందని సోషల్‌ మీడియాలో వస్తున విమర్శల గురించి పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు విద్యాశాఖ మంతి సురేష్‌  స్పందిస్తూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఎన్నికల హామీలైన నవరత్నాలకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. ఈ పధకాన్ని కేవలం నవరత్నాలలో భాగంగా గుర్తించాలన్నారు. అమ్మవడి అనేటువంటిది తమ బిడ్డను బడికి పంపిచే పిల్లలకు, తల్లికి కలిపి పదిహేనువేల రూపాయలు ఇవ్వడమనేని కార్పోరేట్ల కోసం కాదన్నారు. నవరత్నాలలో ఉన్నటువంటి ముఖచిత్రాన్ని మారుస్తాం అనే అంశాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నవత్నలకు ఒక మానిటరింగ్‌ కమిటీ ఉంటుందని దాని ద్వారా నవరత్నాలు అమలుచేయబడతాయన్నారు. రాబోమే రోజులలో నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టనున్నామన్నారు. దీనికి సంబందిచిన ఒక ముసాయిదా పత్రాన్నికూడా తయారుచేసి ముఖ్యమంత్రికి పంపడం జరిగిందన్నారు.

రాష్ట్రంలో ఉన్నటువంటి నలబైవేల ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్‌ పాఠశాలల కన్నా ధీటుగా తీర్చిదిద్దుతామాన్నారు. అంతేకాంకుండా అధిక ఫీజులు వసూలుచేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై కఠన చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే చేపట్టబోతున్నామని తెలియజేశారు.

సమావేశంలో జిల్లా కలెక్లర్‌  పోలా భాస్కర, జాయింట్‌ కలెక్టర్‌ నాగలక్ష్మీ, జాయింట్‌  కలెక్టర్‌-2 డాక్టర్‌ ఎ సిరి, జిల్లా రెవిన్యూ అదికారి వెంకటసుబ్బయ్య, ఇరిగేషన్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌, పబ్లిక్‌ హెల్త్‌ అధికారులు పాల్గొన్నారు.