Home బాపట్ల ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి రూ.లక్ష విరాళం

ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి రూ.లక్ష విరాళం

15
0

చీరాల (DN5 News) : స్థానిక ఎన్‌ఆర్‌ అండ్‌ పిఎం ఉన్నత పాఠశాల (NR&PM) వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యుడు గుగ్గిలం వెంకట సురేష్ పుట్టినరోజు సందర్భంగా గ్రౌండ్ నందు ఎన్‌విఎస్‌ అండ్‌ ఎస్‌జెఆర్‌ ఆర్య వైశ్య కళ్యాణ మండపం ఆధునీకరణ పనులు నిమిత్తం ప్రెసిడెంట్ చేబ్రోలు బాబాజీరావుకు రూ.1,01,116 విరాళం ప్రకటించారు. శ్రీమహదేవ వేద గోశాలకు రూ.2,500, వేద పాఠశాల విద్యార్థులకు ఒక బస్తా బియ్యం, శ్రీకృష్ణ గోశాలకు రూ.1,500 నగదు అందజేశారు. వాకింగ్‌ సభ్యులకు స్వీట్లు, హాట్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ళ గురుప్రసాద్, జి సుధాకరరావు, నారాయణమూర్తి, గుంటూరు మాధవరావు, ఎంఎస్‌, సుబ్బారావు, వీరాంజనేయులు, ప్రసాద్, రవి పాల్గొన్నారు.