Home ప్రకాశం ప‌ది ఫ‌లితాల్లో 10కి10సాధించిన సందీప్ విద్యార్ధులు

ప‌ది ఫ‌లితాల్లో 10కి10సాధించిన సందీప్ విద్యార్ధులు

589
0

చీరాల : ప‌దోత‌ర‌గ‌తి ఫలితాలలో ప్ర‌కాశం జిల్లా చీరాల‌ సందీప్ స్కూల్ విద్యార్థులు 10కి10జిపిఎ సాధించి రాష్ట్ర స్థాయి ఫ‌లితాల జాబితాలో నిలిచారు. 10కి10సాధించ‌డ‌మే కాకుండా ప‌రీక్ష‌కు హాజ‌రైన 46మంది విద్యార్ధులు ఉత్తీర్ణ‌త సాధించి 100% ఫలితాలు న‌మోదు చేసుకున్నారు. ఈసంద‌ర్భంగా ఉత్త‌మ ఫ‌లితాలు సాధించి పాఠ‌శాల ప్ర‌తిష్ట చాటిన విద్యార్ధుల‌ను, అధ్యాప‌కుల‌ను పాఠ‌శాల వ్య‌వ‌స్థాప‌కులు తుళ్లూరి వెంక‌టేశ్వ‌ర్లు (టివి) అభినందించారు. పాఠ‌శాల‌కు చెంద‌దిన డి పూజితుసుష్మ‌, పి అమృత‌శ్రీ‌చంద‌న‌, జిఎన్‌జె కిర‌ణ్మ‌యి, పి వినీల 10కి10జిపిఎ సాధించార‌ని తెలిపారు. వీరితోపాటు 9.8జిపిఎ ఆరుగురు, 9.7జిపిఎ ముగ్గురు, 9.5జిపిఎ ఇద్ద‌రు సాధించార‌ని తెలిపారు. ఫలితాలు సాధించిన విద్యార్థులను, పిబ్బంది, ప్రిన్సిపాల్ డి నరసింహాచార్యులు పాల్గొన్నారు.