Home బాపట్ల సహాయక చర్యల్లో ఎంఎల్‌ఎ కొండయ్య

సహాయక చర్యల్లో ఎంఎల్‌ఎ కొండయ్య

20
0

చీరాల : భారీ వర్షాల కారణంగా విజయవాడలో వరద ముంపుకు గురైన గ్రామాల్లో బాధితులకు ఎంఎల్‌ఎ కొండయ్య సహాయం అందించారు. పడవ సాయంతో స్వయంగా బాధితుల వద్దకు వెళ్ళి పరామర్శించారు. వరద నీటిలో అల్లాడుతున్న గొల్లపూడి, భవానిపురం ప్రాంతాల్లో ఆయన కనిగిరి శాసన సభ్యులు ముక్కు ఉగ్ర నరసింహరెడ్డితో కలసి పర్యటిచారు. చీరాల వాడరేవు నుండి ఐదు పడవలు, పడవలు నడపగలిగిన మత్య్సకారులను వెంట తీసుకెళ్లి వరద బాధితుల అవసరమైన సహాయక చర్యలు చేపట్టారు. బాధితులకు అల్పాహారం, త్రాగు నీటిని అందజేశారు. ఆయన వెంట పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.