Home ఆంధ్రప్రదేశ్ ముర‌ళీమోహ‌న్‌కు చంద్ర‌బాబు, లోకేశ్ ప‌రామ‌ర్శ‌

ముర‌ళీమోహ‌న్‌కు చంద్ర‌బాబు, లోకేశ్ ప‌రామ‌ర్శ‌

314
0

హైద‌రాబాద్ : వెన్నెముక‌కు సంబంధించిన శ‌స్ర్త‌చికిత్స చేయించుకున్న మాజీ ఎంపీ ముర‌ళీమోహ‌న్‌ను టీడీపీ జాతీయ అధ్య‌క్షులు చంద్ర‌బాబు నాయుడు, టీడీపీ కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ప‌రామ‌ర్శించారు. సోమ‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లోని ముర‌ళీమోహ‌న్ నివాసానికి వెళ్లి యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కేర్ హాస్పిట‌ల్ వైద్యులు స‌ర్జ‌రీ విష‌యంలో చాలా కేర్ తీసుకున్నార‌ని ముర‌ళీమోహ‌న్ వివ‌రించారు. రెండువారాల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించార‌ని తెలిపారు. వైద్యులు సూచ‌న‌లు పాటించాల‌ని, పూర్తిగా న‌య‌మ‌య్యేవ‌ర‌కూ విశ్రాంతి తీసుకోవాల‌ని చంద్ర‌బాబు, లోకేశ్‌ సూచించారు.