చీరాల : చీరాల ఇంజనీరింగ్ కళాశాల (సిఇసి) ఆవరణలో హాస్టల్ విద్యార్ధుల వార్షికోత్సవ సంబరాలు బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన సభలో కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ తేళ్ల అశోక్కుమార్ మాట్లాడారు. జిల్లాలోనే మొట్టమొదటి కళాశాల అనుబంధ హాస్టల్ చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాల, బాలికలకు వేరువేరుగా నాలుగు అంతస్థులతో హాస్టల్ భవనాలు 700మంది విద్యార్ధులకు సరిపోయే విధంగా నిర్మాణం చేసినట్లు తెలిపారు.
విద్యార్ధులకు హైస్పీడు ఇంటర్నెట్, మినరల్ వాటర్, ఆటస్థలం, నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. అనంతరం డాక్టర్ సివి బ్రహ్మాచారి మెమోరియల్ సెమినార్ హాల్లో విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ జ్యోతి, శేషగిరిరావు, ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ ఎన్ సురేష్బాబు, వసతి గృహ సంచాలకులు బోనం రాఘవయ్య, శివబాబు, రమణమ్మ, హెచ్ఆర్ సంచాలకులు రాంబాబు, లక్ష్మిభవాని, శిరీష పాల్గొన్నారు.