Home ప్రకాశం ఎస్సి, ఎస్టీ ట్రాక్టర్స్ సబ్సిడీ మంజూరుపై వినతి

ఎస్సి, ఎస్టీ ట్రాక్టర్స్ సబ్సిడీ మంజూరుపై వినతి

324
0

ఒంగోలు : జిల్లాలో సబ్సిడీపై ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఇచ్చిన ట్రాక్టర్ల సబ్సిడీ ప్రభుత్వం మంజూరు చేయక పోవడంతో లబ్ధిదారులు వడ్డీల భారంతో పడుతున్న ఇబ్బందులను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సంఘం ప్రతినిధి వి భక్తవత్సలం కలెక్టర్ పోలా భాస్కర్ కు వినతి పత్రం అందజేశారు. కరోనాతో పనులు లేక వడ్డీకూడా కట్టలేని స్థితిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ట్రాక్టర్ లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితులు గమనించాలని కోరారు. ఏడాది కాలంగా సబ్సిడీ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. కందుకూరు, కొండేపి ఎమ్యెల్యేలు మానుగుంట మహీధర్ రెడ్డి, డోలా శ్రీబాలవీరాంజనేయులుకు వివరించారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి వివరించి సమస్య పరిష్కరిస్తామని మహీధర్ రెడ్డి హామీ ఇచ్చారు.