చీరాల, మార్చి 09 (DN5 News) : గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశాల మేరకు టూ టౌన్ సిఐగా బి అశోక్ కుమార్ సోమవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. గతంలో పని చేసిన సిఐ నాగభూషణం బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో బాధ్యతలు స్వికరించారు. నెల్లూరు సీసీఎస్లో విధులు నిర్వహించిన ఆయనను టూటౌన్కు బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.






