Home ప్రకాశం పోలీసు స్టేషన్ వద్ద అర్ధరాత్రి హైరాణ

పోలీసు స్టేషన్ వద్ద అర్ధరాత్రి హైరాణ

1308
0

– సోషల్ మీడియా పోస్టులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన         – వైసిపి గ్రూపుల పోరులో వెలుగు చూస్తున్న అవినీతి                      – పోలీసులకు పిర్యాదు

టంగుటూరు (దమ్ము) : పోలీస్ స్టేషన్ వద్ద అర్ధరాత్రి వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. నివేశన స్థలాలు, ఉపాధి పనుల్లో సహకార పరపతి సంఘ అధ్యక్షులు రావూరి అయ్యవారయ్య అవినీతి పాల్పడ్డారని ఆరోపిస్తూ నత్తల క్రాంతి, లింగంగుంట రవిబాబు వాట్సాప్ గ్రూపులో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వైస్సార్సీపీ మండల అధ్యక్షులు సూదనాగుంట హరిబాబు, మండల నాయకులు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అర్ధరాత్రి 12వరకు పోలీస్ స్టేషన్ వద్ద చేరారు.

వైసీపీ మండల నాయకులు సిరిపురపు విజయ భాస్కర్ రెడ్డి వర్గానికి చెందిన వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, వాసేపల్లిపాడు మాజీ సర్పంచ్ లింగంగుంట రవిబాబు, మరో నాయకుడు నత్తల క్రాంతి కుమార్ లను అరెస్టు చేయాలని వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు సూదనగుంట శ్రీహరిబాబు పిర్యాదులో పేర్కొన్నారు.

కార్యకర్తలు చెబుతున్న వివరాల ప్రకారం వైసీపీ మండల నాయకులు రావూరి అయ్యవారయ్యపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఆదివారం రాత్రి ఒక మెసేజ్ వాట్సాప్ గ్రూపులలో వచ్చింది. వెంటనే పార్టీ మండల అధ్యక్షులు హరిబాబు, అయ్యవారయ్య వర్గీయులు అయ్యవారయ్యతో కలిసి కంపినీ వద్ద సమావేశమయ్యారు. అనంతరం అక్కడి నుండి పోలీస్ స్టేషన్ వరకు ప్రదర్శనగా వెళ్ళారు. ఆ సమయంలో ఎస్సై వైవి రమణయ్య లేకపోవడంతో ఎస్సై కి ఫోన్ చేశారు. తాను బయట ఉన్నానని, స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాలని ఎస్ఐ సూచించడంతో అక్కడే విధుల్లో ఉన్న ఏఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో అయ్యవారయ్యపై నిరాధారణ అవినీతి ఆరోపణలతో వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టిన లింగంగుంట రవిబాబు, నత్తల క్రాంతికుమార్ లపై కేసునమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని కోరారు.

అవినీతి జరిగినట్లు వాట్సాప్ లో చేసిన పోస్ట్లు క్రింద చూడగలరు