చీరాల : వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా టిడిపి సీనియర్ నాయకులు కౌతరపు జనార్ధనరావు నియమితులు అయ్యారు. శుక్రవారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఆయన గతంలో కొత్తపేట పంచాయితీ ఉపసర్పంచిగా కూడా పనిచేశారు. టిడిపి ఆవిర్భావం నుండి పార్టీలో వివిద స్థాయిల్లో అంకిత భావంతో సేవలు అందించారు. శాసన సభ్యులు ఎంఎం కొండయ్య గెలుపులోనూ ఆయన కీలకంగా పనిచేశారు. ఎఎంసి ఛైర్మన్ పదవి తొలిసారి చేనేతలకు లభించడంతో పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఆయన సన్నిహితులు, మిత్రులు ఆయనను అభినందించారు.