చీరాల (DN5 News) : పట్టణంలోని 28వార్డు హరిప్రసాద్నగర్లోని పోలేరమ్మ తల్లి తిరుణాల సందర్భంగా మాజీ ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్ అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుణాల మహోత్సవానికి విచ్చేసి ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు తొలుత స్వాగతం పలికారు. కార్యక్రమంలో పోలేరమ్మ గుడి కమిటీ సభ్యులు, ఆమంచి అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.






