Home ప్రకాశం మద్యం రద్దు చేయాలని ఐధ్వ జీబు యాత్ర

మద్యం రద్దు చేయాలని ఐధ్వ జీబు యాత్ర

312
0

చీరాల : మద్యం మాఫియాని పారదోలాలని కోరుతూ డిసెంబర్ రెండున ప్రారంబైన జీబు యాత్ర మంగళవారం చీరాల చేరుకుంది. ఈ సందర్భంగా శెనగ మహిళ కార్మికులతో కలిసి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి మున్వర్ సుల్తానా మాట్లాడుతూ మద్యం మాఫియా వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయన్నారు.

మద్యం వలన కన్న కూతురికి మాన రక్షణ లేకుండా పోతుందన్నారు. మద్యాన్ని పూర్తిగా అరికడతానని మహిళల ఓట్లు వేయించుకున్న చంద్రబాబు ఇప్పుడు దాని గురించి మాట్లాడుతుంటుంటే అరెస్ట్ లు చేయిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఉసా ఆదిలక్ష్మి, సుజాత పాల్గొన్నారు.