Home బాపట్ల ప్రకాశం పంతులుకు ఘన నివాళి

ప్రకాశం పంతులుకు ఘన నివాళి

35
0

అద్దంకి : ప్రకాశం మిత్ర మండలి ఆధ్వర్యంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 68వ వర్ధంతి సందర్భంగా స్థానిక బంగ్లా రోడ్డులోని టంగుటూరి పంతులు విగ్రహానికి  పూల మాల వేసి మంగళవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రకాశం పంతులు ముని మనవరాలు సుభాషిణి పంతులు విగ్రహానికి పూలదండ వేసి వారి నిస్వార్థ దేశభక్తి, త్యాగ నిరతి, ధైర్య సాహసాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ప్రకాశం మిత్ర మండలి కార్యదర్శి షేక్ మహమ్మద్ రఫీ, కోశాధికారి ఊటుకూరు రామకోటేశ్వరావు, సృజన అధ్యక్షులు గాడేపల్లి దివాకర్ దత్, రోటరీ పూర్వ అసిస్టెంట్ గవర్నర్ వీరవల్లి సుబ్బారావు (రుద్రయ్య), అధ్యక్షులు చప్పిడి వీరయ్య, కార్యదర్శి చుండూరి మురళి సుధాకర్, కోశాధికారి మలాది శ్రీనివాసరావు, జాషువా కళా పీఠం పిసిహెచ్ కోటయ్య,  జానపద కళాపీఠం ఉబ్బా దేవపాలన, పుట్టంరాజు రామచంద్రమూర్తి, మస్తాన్ మాస్టారు, నిమ్మరాజు నాగేశ్వరరావు, పాలపర్తి జ్యోతిష్మతి, ధర్మవరపు శ్రావణ్ కుమార్, సంకా సుబ్రహ్మణ్యం (బాబు),  తమ్మన శ్రీనివాసరావు, ప్రముఖ చిత్రకారుడు బాలు, అలహరి హరిబాబు, సాంస్కృతిక, కళా రంగాల సభ్యులు పాల్గొన్నారు.