స్టార్గా ఎంత పేరున్నా దర్శకులను విపరీతంగా గౌరవించే హీరో మహేశ్ బాబు. డైరెక్టర్స్కి కావాల్సిన అవుట్ ఫుట్ ఇవ్వడానికి మహేశ్ ప్రాణం పెట్టేస్తాడు. అందుకే ఈ సూపర్ స్టార్ని డైరెక్టర్స్ హీరో అంటారు. తనకి విజయాలను అందించిన దర్శకులతో రియల్ లైఫ్లో కూడా క్లోజ్గా ఉండటం మహేశ్కి అలవాటు. గతంలో కొందరి దర్శకులతో ఈ హీరో ఇలాంటి రిలేషన్ నే మైంటైన్ చేశాడు. ఇక తనకి ‘మహర్షి’ లాంటి మంచి చిత్రాన్ని అందించిన వంశీ పైడిపల్లిపైన కూడా మహేశ్కి బాగా గురి కుదిరింది. దీనితో మహేష్ తన తదుపరి చిత్రాన్ని’మహర్షి’ దర్శకుడితో కమిట్ అయ్యాడు. తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న వంశీ పైడిపల్లి ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు.
నిజానికి మహేశ్ ఈ మధ్య కాలంలో పక్కా కమర్షియల్ చిత్రాలు చేసింది లేదు! ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరూ’ కూడా యాక్షన్ కామెడీ. ఇందులో హీరో ఎలివేషన్ కి కొంత వరకే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ లోటు వంశీ పైడిపల్లి చిత్రం తీర్చబోతుందని సమాచారం. ఎందుకంటే ఈసారి మహేష్ ని ఒక గ్యాంగ్ స్టర్గా చూపించేందుకు వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని సమాచారం.
మహేష్ 27వ చిత్రం ‘కె.జి.యఫ్.’ దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఉండబోతుందన్న వార్తలు నిన్న మొన్నటి వరకు వినిపించాయి. అయితే ఏవో కారణాలతో ఆ ప్రాజెక్ట్ వెనక్కి పోవడంతో వంశీ పైడిపల్లి సినిమా ముందుకి వచ్చింది. ప్రస్తుతం సూపర్ స్టార్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ యూట్యూబ్ రికార్డ్స్ని క్రియేట్ చేయడం విశేషం. ఈ సినిమా విడుదల తరువాత మహేశ్ కాస్త విరామం తీసుకోనున్నాడట. ఈ గ్యాప్లో వంశీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయనున్నాడని సమాచారం. మరి ‘మహర్షి’గా సాఫ్ట్ లుక్లో ఆకట్టుకున్న ఈ శ్రీమంతుడు గ్యాంగ్ స్టర్గా బాక్సాఫీస్ వద్ద ఎలా గర్జిస్తాడో చూడాలి.