Home ఆంధ్రప్రదేశ్ భగవంతుడు చేసిన పొరపాటు

భగవంతుడు చేసిన పొరపాటు

511
0

నెల్లూరు : అంగ వైకల్యం అనేది భగవంతుడు చేసిన చిన్న పొరపాటని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. దివ్యాంగుల పాలిట దేవుడు చేసిన పొరపాటును మానవులు సరిదిద్దుకునే పనిలో భాగంగానే స్వర్ణ టోల్ ప్లాజా యాజమాన్యం ఉపకరణాల పంపిణీ చేపట్టడం అభినందనీయ మన్నారు. వెంకటాచలం మండలం ఎర్రగుంటలోని ప్రాంతీయ వికలాంగుల నైపుణ్యాభివృద్ధి, పునరావాసం, సాధికారత కేంద్రంలో స్వర్ణ టోల్ ప్రయివేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వికలాంగ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

వికలాంగుల ప్రాంతీయ కేంద్రానికి రూ.60లక్షల విలువైన బస్ అందించడంతో పాటు, రూ.20 లక్షల విలువైన ఉపకరణాలను దివ్యాంగులకు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ యంవి శేషగిరిబాబుతో కలిసి పాల్గొన్నారు.

ప్రధానంగా దివ్యాంగుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రవాణా కోసం ప్రత్యేకంగా బస్సును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చిన్న చిన్న లోపాలు ఉన్న వారు ఛాలెంజ్ గా సమాజంలో మనుగడ సాధించడం అభినండిచాల్సిన అంశం అన్నారు. గతంలో తాను జెడ్పీ చైర్మన్ గా ఉన్న సమయంలో దివ్యాంగుల కోసం పలు సేవ కార్యక్రమాలు నిర్వహించానని చెప్పారు. ఎమ్మెల్యేగా కూడా చేశాను, త్వరలోనే మరిన్ని కార్యక్రమాలు చేస్తానన్నారు.

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో దివ్యాంగులకు ప్రాంతీయ కేంద్రాన్ని స్థాపించారని చెప్పారు. ఇటువంటి సేవా కేంద్రం తన నియోజకవర్గంలో ఉండడం సంతోషంగా ఉందన్నారు. స్వర్ణ టోల్ ప్లాజా, సియస్ఆర్ నిధులతో ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషం కలిగించిందన్నారు.