Home ప్రకాశం జిల్లా స్థాయి గణిత పోటీల్లో కొండెపి విద్యార్థుల ప్రతిభ

జిల్లా స్థాయి గణిత పోటీల్లో కొండెపి విద్యార్థుల ప్రతిభ

469
0

ఒంగోలు : వేదిక్ మాథ్స్ ఆధ్వర్యంలో ఒంగోలు హర్షిణి డిగ్రీ కాలేజీలో జిల్లాస్థాయిలో లెవెల్ వన్ విభాగంలో వేదిక మాథ్స్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో కొండేపి మండలం కె.ఉప్పలపాడు పాపారావు పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారు. తొమ్మిదో తరగతి విద్యార్థిని లావణ్య మొదటి బహుమతి గెలుపొందగా, 8వ తరగతి విద్యార్థి రోహిత్ రెండవ బహుమతి గెలుపొందారు. అబాకస్ లెవెల్ వన్ విభాగంలో రెండవ తరగతి విద్యార్థిని శివాని తృతీయ బహుమతి గెలుపొందినట్లు పాపారావు పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ చిడిపోతు శిశిర్ చౌదరి, ప్రిన్సిపాల్ టి అనూరాధ తెలిపారు. విద్యార్థులను అభినందించారు.