అమరావతి (Amaravati) : ఎంఎల్సి పోతుల సునీత (MLC Pothula Sunitha) వైసిపికి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతోపాటు ఎంఎల్సి పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. ప్రస్తుతం ఆమె వైసిపి ఎంఎల్సిగా, వైసిపి (ysrcp) మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. తర్వలో ఆమె భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు. 2014లో ఆమె చీరాల నుండి టిడిపి ఎంఎల్ఎ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో స్వతంత్ర అభ్యర్ధిగా ఆమంచి కృష్ణమోహన్ గెలిచారు. 2014లో అధికారానికి వచ్చిన టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు ఆమెకు ఎంఎల్సి పదవితోపాటు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిని చేశారు. అయితే 2019ఎన్నికల్లో టిడిపి ఓడిపోయిన అనంతరం ఆమె వైసిపిలో చేరారు. టిడిపి (Telugu desham) ప్రభుత్వంలో పొందిన ఎంఎల్సి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వైసిపి తరపున ఉప ఎన్నికల్లో మళ్లీ ఎంఎల్సి అయ్యారు. ఇప్పటి వరకు ఆమె వైసిపి ఎంఎల్సిగానే ఉన్నారు. ప్రస్తుతం రాజీనామాతో ఖాళీ అవనున్న ఆమె స్థానాన్ని ఆమెకే ఇస్తారా? మరొకరికెవరికైనా ఇస్తారా? అనేది వేచి చూడాల్సి ఉంది.