పర్చూరు (DN5 News) : సమాజంలో దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు సహకరించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (MLA Yeluri Sambashivarao) అన్నారు. నోవా అగ్రి గ్రూప్, గ్రీన్ స్పార్క్ ఫౌండేషన్, ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 20 మంది దివ్యాంగులకు తన క్యాంపు కార్యాలయంలో ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్లను ఆదివారం అందజేశారు. వీటి ద్వారా వారి దైనందిన జీవనంలో స్వయం ఆధారిత పెరుగుతుందని తెలిపారు.






