ఒంగోలు : ప్రకాశం జిల్లా మార్టూరు సమీపంలోని రాజుపాలెం బస్టాపు వద్ద మంగళవారం ఉదయం మినీలారీ హోటల్లోకి దూసుకెళ్లింది. ఫర్నీచర్ లోడుతో విజయవాడ నుండి తిరుపతి వెళుతున్న లారీ ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తుతో జరిగిన ప్రమాదంలో డ్రైవర్తోపాటు మరొకరు లారీలో ఇరుక్కుపోయారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
సుమారు రెండు గంటల పాటు శ్రమించి లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్ బేగ్ ఇజాజ్ను బయటకు తీశారు. జాతీయ రహదారి పెట్రోలింగ్ ఎఎస్ఐ హరిబాబు రక్షణ చర్యలు చేపట్టారు. క్షత గాత్రుల పరిస్ధీతి విషమంగా ఉండటంతో 108లో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.