నర్సరావుపేట : ఖోఖో విజేతగా చీరాల ఇంజనీరింగ్ కళాశాల జట్టు నిలిచింది. నర్సరావుపేట ఇంజనీరింగ్ కళాశాల ఫెస్ట్ ఈనెల 16, 17తేదీల్లో నిర్వహించారు. ఫెస్ట్ సందర్భంగా నిర్వహించిన ఖోఖో టోర్నమెంట్కు 15జట్లు పోటీ పడ్డాయి. పోటీల్లో చీరాల ఇంజనీరింగ్ కళాశాల (సిఇసి)లో తృతీయ సంవత్సరం చదువుతున్న హనుమాన్ కెప్టెన్గా పోటీకి దిగిన జట్టు విజేతగా నిలిచినట్లు నిర్వాహకులు ప్రకటించారు.
ఈసందర్భంగా చీరాల ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో క్రీడాకారులను కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ తేళ్ల అశోక్కుమార్ అభినందించారు. ఇలాంటి ఫెస్ట్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. కళాశాలల మద్య ఆరోగ్యకరమైన పోటీలు జరడం మంచిదన్నారు. విద్యార్ధుల్లో స్నేహపూర్వక వాతావరణం ఉంటుందన్నారు. విద్యావిధాన మెళుకువలు, క్యాంపస్లైఫ్, ఎలాంటి అంశాలు అభివృద్ది చేసుకోవాలనేవి విద్యార్ధులు నేర్చుకునేందుకు అవకాశం వస్తుందన్నారు. కార్యక్రమంలో వ్యాయామ అధ్యాపకులు కె శ్రీనివాసరావు, ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ ఎన్ సురేష్బాబు, ఎస్ నాగరాజు, క్రికెట్ కోచ్ కోటి పాల్గొన్నారు.