Home బాపట్ల వర్షబాధితులకు అన్నదానం

వర్షబాధితులకు అన్నదానం

22
0

చీరాల : అభివృద్ధితో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటామని టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ మహేంద్ర నాథ్ పేర్కొన్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా స్వర్ణ రోడ్డులోని పెద కాలువ వద్ద కాపులా ఉంటున్నా యానాది కాలనీ వాసులకు ఆయన ఆదివారం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా రైతులతో పాటు ప్రజలు కూడా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని అన్నారు. అండగా ఉంటామని అన్నారు. ఆయన వెంట తెలుగు యువత అధ్యక్షుడు లావేటి శ్రీనివాస్ తేజ, వెలిది అమర్నాథ్, రవితేజ, రబ్బాని, పులి హరికృష్ణ, తెలుగుదేశం కౌన్సిలర్లు పాల్గొన్నారు.