Home గుంటూరు బాపట్ల మున్సిపల్‌ కమిషనర్‌గా పాయసం

బాపట్ల మున్సిపల్‌ కమిషనర్‌గా పాయసం

350
0

బాపట్ల : గుంటూరు జిల్లా బాపట్ల మున్సిపల్‌ కమిషనర్‌గా పాయసం వెంకటేశ్వరరావు అదనపు బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన పొన్నూరు మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. బాపట్ల కమిషనర్‌గా ఉన్న శ్రావణ్‌కుమార్‌ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో పొన్నూరు కమిషనర్‌గా ఉన్న పాయసం వెంకటేశ్వరరావుకు ఎఫ్‌ఎసి బాధ్యతలు ఇస్తూ సి అండ్‌ డిఎంఎ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఆయన బాపట్ల కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు.

వైఎస్‌ఆర్‌ నవశకంపై వార్డు కార్యదర్శులు సిబ్బందితో మున్సిపల్‌ కమిషనర్‌గా బాధ్యతులు తీసుకున్న పాయసం వెంకటేశ్వరరావు బాపట్ల మున్సిపల్‌ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్ధేశించిన సమయంలో సర్వేలు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో డిఇ కె మాల్యాద్రి, మేనేజర్‌ చంద్రమోహన్‌ పాల్గొన్నారు.

బాపట్ల కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న పాయసం వెంకటేశ్వరరావును సిబ్బంది అభినందించారు. కార్యాలయంలో అన్ని విభాగాల సిబ్బంది ఆయనను కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించి పరిచయం చేసుకున్నారు.