Home బాపట్ల కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా ఆమంచి

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా ఆమంచి

242
0

బాపట్ల : కాంగ్రెస్ బాపట్ల జిల్లా అధ్యక్షునిగా మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ నియమితులయ్యారు. 2009లో చీరాల నుండి కాంగ్రెస్ శాసన సభ్యునిగా ఏమనికైన ఆయన గతంలో కాంగ్రెస్ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షునిగా పని చేశారు. 2014లో కాంగ్రెస్ ను విబేదించి స్వతంత్ర అభ్యర్థిగా చీరాల నుండి శాసనసభ్యునిగా గెలుపొందారు. 2019 ఎన్నికల నాటికీ వైసిపీలో చేరి చీరాల నుండి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత వైసిపీ పర్చూరు నియోజకవర్గం ఇంచార్జిగా పని చేశారు. 2024ఎన్నికల్లో వైసిపీ చీరాల నియోజకవర్గం సీటు నిరాకరించినదనే కారణంతో కాంగ్రెస్ లో చేరి చీరాల నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 40 వేల ఓట్లతో తృతీయ స్థానంలో నిలిచారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షునిగా నియమితులవడం పట్ల ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేశారు.