Home బాపట్ల సభా వేదికను ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ కొండయ్య

సభా వేదికను ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ కొండయ్య

25
0

చీరాల : విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకోవాలని, తద్వారా మంచి భవిష్యత్తు లభిస్తుందని ఎంఎల్‌ఎ ఎంఎం కొండయ్య అన్నారు. మండలంలోని వాడరేవు జెడ్‌పి ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన సభా వేదికను, ప్రాంగణంను స్వామి రామానంద సరస్వతితో కలసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థు సద్వినియోగం చేసుకొని చదువుల్లో రాణించాలని కోరారు. విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో యువ నాయకులు గౌరీ అమర్నాథ్, అధికారులు, తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.